నివారణ చర్యలతోనే డెంగ్యూ నియంత్రణ

ABN , First Publish Date - 2022-05-15T05:33:02+05:30 IST

నివారణ చర్యలతోనే డెంగ్యూను నియంత్రిం చవచ్చని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు అన్నారు. సోమవారం ఆయన కార్యాల యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం గోడ ప్రతులను విడుదల చేసి మాట్లాడా రు

నివారణ చర్యలతోనే డెంగ్యూ నియంత్రణ
గోడ ప్రతులను విడుదల చేస్తున్న డీఎంహెచ్‌వో, అధికారులు

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 14: నివారణ చర్యలతోనే డెంగ్యూను నియంత్రిం చవచ్చని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు అన్నారు. సోమవారం ఆయన కార్యాల యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం గోడ ప్రతులను విడుదల చేసి మాట్లాడా రు. సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలన్నారు. జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్‌లు అనిత, నీరజ, హఫీజ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఫయాజ్‌ఖాన్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, సబ్‌యూనిట్‌ అధికారి నాందేవ్‌, మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఫ ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపవద్దని డీఎంహెచ్‌వో సుబ్బారా యుడు అన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో వ్యాధిగ్రస్తుల స్మారక దినోత్సవ పోస్టర్‌లను విడుదల చేశారు. ఆదివారం 39వ ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల మృతల స్మారక దినోత్సవం సందర్భంగా  కొవ్వొత్తుల ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  

Updated Date - 2022-05-15T05:33:02+05:30 IST