చికెన్ వడ్డించలేదని మందుబాబులు దాబాకు నిప్పంటించారు

ABN , First Publish Date - 2021-01-11T15:15:36+05:30 IST

రెస్టారెంటులో కోడిమాంసం వడ్డించలేదనే కోపంతో దాబాకు నిప్పంటించిన మందుబాబుల ఉదంతం ....

చికెన్ వడ్డించలేదని మందుబాబులు దాబాకు నిప్పంటించారు

నాగపూర్ (మహారాష్ట్ర): రెస్టారెంటులో కోడిమాంసం వడ్డించలేదనే కోపంతో దాబాకు నిప్పంటించిన మందుబాబుల ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో జరిగింది.నాగపూర్ నగరంలో ఆదివారం రాత్రి శంకర్ టేడే(29), సాగర్ పటేల్ (19) లు పీకల దాకా మద్యం తాగి బెల్టరోడి ప్రాంతంలోని దాబాకు వచ్చారు. తమకు చికెన్ వడ్డించమని మందుబాబులు కోరగా, దాబా యజమాని నిరాకరించాడు.దీంతో కోపంతో మందుబాబులిద్దరూ దాబాకు నిప్పంటించి పారిపోయారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

Updated Date - 2021-01-11T15:15:36+05:30 IST