భవిత సెంటర్లను సద్వినియోగం చేసుకోండి : డీఈవో
ABN , First Publish Date - 2020-12-04T04:48:46+05:30 IST
భవిత సెంటర్లను దివ్యాంగుల తల్లిదండ్రులు సద్వి నియోగం చేసుకోవాలని డీఈవో సీవీ రేణుక సూచించారు.
ఏలూరు ఎడ్యుకేషన్, డిసె ంబరు 3 : భవిత సెంటర్లను దివ్యాంగుల తల్లిదండ్రులు సద్వి నియోగం చేసుకోవాలని డీఈవో సీవీ రేణుక సూచించారు. ప్రపంచ వికలాంగుల దినోత్స వాన్ని పురస్కరించుకుని అశోక్ వర్థన స్పెషల్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10 వేల మంది సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించేందుకు, వైద్య సంబంధిత సేవలకు ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున విలీన విద్య (ఐఇ) రిసోర్సు టీచర్లు ఉన్నారని తెలిపారు. మరో 15 మంది ఫిజియోథెరపిస్టులను కూడా భవిత సెంటర్లలో నియమిం చామన్నారు.ఈ కార్యక్రమంలో ఐఇ కోఆర్డినేటర్ ప్రసన్నాంజనేయులు, అసిస్టెం ట్ ఐఇ కో ఆర్డినేటర్ ఆర్.రామారావు, పాఠశాలల ఉపతనిఖీ అధికారి డి.సాం బశివరావు, రిసోర్స్ పర్సన్లు శ్యామల, వెంకట దుర్గ తదితరులు పాల్గొన్నారు.