బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను నిలదీయండి: ఎంపీ వెంకటేష్‌

ABN , First Publish Date - 2022-05-18T03:41:26+05:30 IST

గ్రామాల్లో చిన్న చిన్న సమ స్యలను భూతద్దంలో చూపుతూ ప్రజలను రెచ్చగొడు తూ తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయ కులు, కార్యకర్తలను ప్రజలు నిలదీయాలని ఎంపీ వెంకటేష్‌, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్ర మాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలి సి పాల్గొన్నారు. ద్వారకాపూర్‌, కొత్తపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుపేదల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను నిలదీయండి:  ఎంపీ  వెంకటేష్‌
మహిళ సంఘాలకు చెక్కులను అందిస్తున్న ప్రజాప్రతినిధులు

తాండూర్‌, మే 17: గ్రామాల్లో చిన్న చిన్న సమ స్యలను భూతద్దంలో చూపుతూ ప్రజలను రెచ్చగొడు తూ తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయ కులు, కార్యకర్తలను ప్రజలు నిలదీయాలని ఎంపీ  వెంకటేష్‌, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్ర మాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలి సి పాల్గొన్నారు. ద్వారకాపూర్‌, కొత్తపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుపేదల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.  కరోనా సమయంలోను ఎంత నష్టం వాటిల్లినా సంక్షే మ పథకాలను ఆపలేదన్నారు. ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు లేని పోని ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గ్రామా ల్లోకి వచ్చే రెండు పార్టీల నాయకులను ఆ పార్టీల పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల గురించి అడగాలని సూచించారు. దళితబంధు, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేద న్నారు.  

మండలంలో రూ.1.80 సీఎస్‌ఆర్‌ నిధులతో చేపడు తున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ద్వారకా పూర్‌, కొత్తపల్లి గ్రామాలకు రూ.70 లక్షల చొప్పున రెండు రోడ్లు, కిష్టంపేటకు రూ.40 లక్షలతో మరో రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ద్వారకాపూర్‌కు రోడ్డు మంజూరైన తర్వాతనే గ్రామానికి వస్తానని చెప్పిన ఎమ్మెల్యే మంగళవారం శంకుస్ధాపనకు వచ్చి ప్రజలతో మాట్లాడారు. కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో రూ.42 లక్షల స్ర్తీనిధి రుణాలు, మరో రూ.50 లక్షల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను లబ్ధిదారు లకు అందజేశారు. 42 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీము బారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీపీ ప్రణయ్‌, జడ్పీటీసీ బానయ్య, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, సహకార సంఘం  చైర్మన్‌ దత్తుమూర్తి, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతి నిధులు, నాయకులు పాల్గొన్నారు. మున్నూ రు కాపు సంఘం, ఐబీ మైనార్టీ నాయకులు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సన్మానించారు.  

Updated Date - 2022-05-18T03:41:26+05:30 IST