వచ్చే నెలలో బాపట్ల మెడికల్‌ కాలేజ్‌కు శంకుస్థాపన: డిప్యూటీ స్పీకర్

ABN , First Publish Date - 2020-10-27T17:45:46+05:30 IST

బాపట్ల మెడికల్ కాలేజ్ భూసేకరణ పూర్తయిందని...వచ్చే నెలలో కాలేజ్ నిర్మాణానికి శంఖు స్థాపన చేస్తామని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు.

వచ్చే నెలలో బాపట్ల మెడికల్‌ కాలేజ్‌కు శంకుస్థాపన: డిప్యూటీ స్పీకర్

గుంటూరు: బాపట్ల మెడికల్ కాలేజ్ భూసేకరణ పూర్తయిందని...వచ్చే నెలలో కాలేజ్ నిర్మాణానికి శంఖు స్థాపన చేస్తామని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. జనవరి 26 నాటికి కొత్త  జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. వాన్ పిక్ విషయంలో రైతులను గందరగోళంలో పడేయవద్దని అన్నారు. రైతుల వద్ద నుండి మార్కెట్ రేటు కంటే అధిక ధరకు భూములు కొన్నారని....రైతులు రిజిస్ట్రేషన్ కూడా చేశారని చెప్పారు. నిజాపట్నం పోర్టును అభివృద్ధి చేస్తామని అన్నారు. నవంబర్‌లో స్వల్పకాలిక శాసనసభ సమావేశాలు ఉండే అవకాశం ఉందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు.

Updated Date - 2020-10-27T17:45:46+05:30 IST