నిబంధనలకు విరుద్ధంగా.. ఫలహారం బండి ఊరేగింపులో డిప్యూటీ స్పీకర్

ABN , First Publish Date - 2020-07-14T17:27:45+05:30 IST

హైదరాబాద్: కరోనా నిబంధనలను డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్ ఉల్లంఘించారు. బహిరంగ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అనుమతించలేదు.

నిబంధనలకు విరుద్ధంగా.. ఫలహారం బండి ఊరేగింపులో డిప్యూటీ స్పీకర్

హైదరాబాద్: కరోనా నిబంధనలను డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్ ఉల్లంఘించారు. బహిరంగ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అనుమతించకపోయినప్పటికీ.. తన నివాసం ముందుకు వచ్చిన ఫలహారం బండి ఊరేగింపులో పద్మారావు పాల్గొన్నారు. ఇటీవలే కరోనా బారిన పడి చికిత్స పొందిన పద్మారావు గత వారం ఇంటికి చేరుకున్నారు. కానీ నేడు మాస్క్ లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా బోనాల ఉత్సవాల్లో పద్మారావు పాల్గొనడం చర్చనీయాంశమైంది. సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ ఇలా వ్యవహరించడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 


గతంలో రాష్ట్రం మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉండగా, స్వయంగా కేటీఆర్ మాస్క్ ఇచ్చినా పెట్టుకోకుండా పద్మారావు అలాగే జనంలో తిరిగారు. ఈ విషయాన్ని ఓ సభలో కేటీఆర్ ప్రస్తావించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-07-14T17:27:45+05:30 IST