టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం కన్వీనర్‌గా దేశ్‌పాండే శకుంతల

ABN , First Publish Date - 2022-06-27T05:16:06+05:30 IST

టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం కన్వీనర్‌గా దేశ్‌పాండే శకుంతల

టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం కన్వీనర్‌గా దేశ్‌పాండే శకుంతల
నియామకపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి


తాండూరు/తాండూరురూరల్‌, జూన్‌ 26 : తాండూరు నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ పార్టీకి సుదీర్ఘంగా సేవలందిస్తూ మహిళలను సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించిన దేశ్‌పాండే శకుంతలను నియోజకవర్గ మహిళా విభాగం కన్వీనర్‌గా నియమించారు. ఆదివారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో శకుంతలకు నియామకపత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలోని మహిళలను ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు పార్టీ కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యపరిచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆమెకు సూచించారు. అనంతరం శకుంతల మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధికి తన వంతు సహాయసహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సాయిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాందాస్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఎత్తరి రాములు, నాయకులు ఉమాశంకర్‌, మాజీ వైస్‌ఎంపీపీ శేఖర్‌, మాజీ ఉపసర్పంచ్‌ హసన్‌పటేల్‌, డైరెక్టర్‌ మల్లప్ప ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ తాండూరు పట్టణ అధికార ప్రతినిధిగా రాజుగౌడ్‌

 టీఆర్‌ఎస్‌ పార్టీ తాండూరు పట్టణ అధికార ప్రతినిధిగా పార్టీ సీనియర్‌ నాయకుడు ఎస్‌.రాజ్‌గౌడ్‌ను నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజ్‌గౌడ్‌కు నియామకపత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-06-27T05:16:06+05:30 IST