ఎంపీపీ మృతి పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-10T05:31:14+05:30 IST

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎంపీపీ వెంకట్‌రావు మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే చటి క్రాంతికిరణ్‌ అన్నారు.

ఎంపీపీ మృతి పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే

రాయికోడ్‌, మే 9: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎంపీపీ వెంకట్‌రావు మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే చటి క్రాంతికిరణ్‌ అన్నారు. ఆదివారం  రాయికోడ్‌ మండల పరిధిలోని శాపూర్‌ గ్రామంలో ఎంపీపీ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఎంపీపీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ఎల్లవేళలా అండగా ఉంటానని, అన్ని విధాల ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని మంచి పేరున్న నాయకుడ్ని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్తకు తాను ఎల్లవేళలా అందుబాటులో  ఉంటూ సేవ చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ మల్లికార్జున్‌, పార్టీ ఆత్మ, వరం అధ్యక్షులు చేవేళ్ల విఠల్‌, వీరారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బస్వరాజ్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు కొల్లూరు శంకర్‌, రవీందర్‌ ఉన్నారు.


 

Updated Date - 2021-05-10T05:31:14+05:30 IST