పథకం ప్రకారమే అమలాపురంలో విధ్వంసం

ABN , First Publish Date - 2022-05-26T06:52:36+05:30 IST

అగ్రకుల దురహంకారంతో కొందరు పథకం ప్రకారమే ప్రజలను రెచ్చగొట్టి అమలాపురంలో విధ్వంసం సృష్టించారని కేవీపీఎస్‌ నాయకుడు రెమిడాల పరశురాములు, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు తలకొప్పుల సైదులు, బీఎల్‌ఎఫ్‌ వస్కుల మట్టయ్య ఆరోపించారు.

పథకం ప్రకారమే అమలాపురంలో విధ్వంసం
రాస్తారోకో చేస్తున్న దళిత సంఘాల నాయకులు

మిర్యాలగూడ, మే 25: అగ్రకుల దురహంకారంతో కొందరు పథకం ప్రకారమే ప్రజలను రెచ్చగొట్టి అమలాపురంలో విధ్వంసం సృష్టించారని కేవీపీఎస్‌ నాయకుడు రెమిడాల పరశురాములు, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు తలకొప్పుల సైదులు, బీఎల్‌ఎఫ్‌ వస్కుల మట్టయ్య ఆరోపించారు. ఆంధ్రప్రదేశలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నామకరణం సందర్భంగా జరిగిన విధ్వంసాన్ని నిరసిస్తూ కేవీపీఎస్‌, బీఎల్‌ఎఫ్‌, ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికలో భాగంగానే పెట్రోల్‌ డబ్బాలతో వచ్చి దళిత, బీసీ నేతలను ఇళ్లను తగులబెట్టారని ఆరోపించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగానే పేరు కొనసాగించాలన్నారు. ప్రజలు అగ్రకుల కుటిల రాజకీయం ఉచ్చులో పడొద్దని హితవు పలికారు. కార్యక్రమంలో ఎల్‌హెచపీఎ్‌స నాయకులు ఇస్లావత సైదానాయక్‌, మైనార్టీ నాయకులు మహ్మద్‌ గౌస్‌, వెంకటయ్య, దేవయ్య, జనార్ధన తదితరులు పాల్గోన్నారు.


Updated Date - 2022-05-26T06:52:36+05:30 IST