అంబేడ్కర్‌ విగ్రహా ధ్వంసం

ABN , First Publish Date - 2021-10-17T06:20:42+05:30 IST

మండలంలోని నడిపల్లి గ్రామంలో భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు స్థానిక అంబేడ్కర్‌ సంఘం ప్రతినిధులు మేకల సుదర్శన్‌, జలంధర్‌, చిన్న సాయిలులు శనివారం ఎస్సై ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహా ధ్వంసం
కళ్లజోడు విరిగి పోయిన దృశ్యంనడిపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహ ధ్వంసం

డిచ్‌పల్లి, అక్టోబరు 16: మండలంలోని నడిపల్లి గ్రామంలో భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు స్థానిక అంబేడ్కర్‌ సంఘం ప్రతినిధులు మేకల సుదర్శన్‌, జలంధర్‌, చిన్న సాయిలులు శనివారం ఎస్సై ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న రాత్రి అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి చేసి అంబేడ్కర్‌ కళ్ల జోడును విరగగొట్టారని, అంతేకాకుండా విగ్రహం నోట్లో మట్టి కుక్కిన్నట్లు అనావాళ్లు కనిపిస్తున్నాయని వారు మండిపడ్డారు. అం బేడ్కర్‌కు అవమానం చేసిన వ్యక్తులు ఎంతటి వారైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సైకి గ్రామ అంబేడ్కర్‌ సంఘం సభ్యులు ఫిర్యాదు చేయ గా, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-10-17T06:20:42+05:30 IST