అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-11-27T06:03:34+05:30 IST

పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మణిపురం బ్రిడ్జి వద్ద అనుమానాస్పద స్థితిలో మేడిద హరీష్‌బాబు(30) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

గుంటూరు(కార్పొరేషన్‌) నవంబరు 26: పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మణిపురం బ్రిడ్జి వద్ద అనుమానాస్పద స్థితిలో మేడిద హరీష్‌బాబు(30) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలేనికి చెందిన హరీష్‌బాబు అనారోగ్యంతో గత రాత్రి మణిపురం బ్రిడ్జి వద్దనున్న శ్రీకృష్ణ ఆసుపత్రిలో చేరాడు. ఐసీయూలో ఉన్న అతడు వేరే ఇంజక్షన్‌ చేసుకుని మృతి చెందినట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Updated Date - 2020-11-27T06:03:34+05:30 IST