నవ్యాంధ్రకు సరికొత్త బాటలు వేసింది చంద్రబాబే..: దేవతోటి నాగరాజు
ABN , First Publish Date - 2022-04-08T19:23:22+05:30 IST
నవ్యాంధ్రకు సరికొత్త బాటలు వేసింది చంద్రబాబు నాయుడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కట్టుబట్టలతో అమరావతికి వచ్చి నవ్యాంధ్రకు సరికొత్త బాటలు వేసింది చంద్రబాబు నాయుడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనుభవంలేక, పరిపాలించడం చేతకాక, అజ్ఞానంతో ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు.
కరెంటు కోతలతో గ్రామాలు అంథకారంలో మునిగిపోయాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద రోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని దేవతోటి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కళ్లున్న కబోదిలా.. మానవత్వం మరిచిన మనుషుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తప్పిదాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్న మీడియా సంస్థలపై అవాకులు, చెవాకులు పేలుస్తూ.. మీడియాను, మీడియా సంస్థల అధినేతలను నిందించటమే పనిగా పెట్టుకున్నారని దేవతోటి నాగరాజు విమర్శించారు.