రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగు
ABN , First Publish Date - 2021-12-06T05:16:50+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కనుమరుగై పోయిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి నాగో తు రమేష్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేం ద్ర ప్రభుత్వం సాయం చేయడం లేదని తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం గా ఉందని ఆయన విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి రమేష్నాయుడు
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 5 : రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కనుమరుగై పోయిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి నాగో తు రమేష్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేం ద్ర ప్రభుత్వం సాయం చేయడం లేదని తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం గా ఉందని ఆయన విమర్శించారు. ఆదివారం ఒంగోలులోని బీజేపీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రా ష్ట్రంలో మంత్రుల తీరు ఆరాచకంగా ఉందన్నారు. అధికారులు అన్నమయ్య డ్యా మ్ ముందస్తుగా మరమ్మతులు చేసి ఉంటే ప్రమాదానికి గురై ఉండేది కాదని చెప్పారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తరుపున వర్ష బాధితులకు కనీస సౌకర్యాలు క ల్పించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో షేక్ ఖలీఫాతుల్లాబాషా, డాక్టర్ కొమ్మి నరసింగరావు, పీవీ.శివారెడ్డి, రావులపల్లి నాగేంద్ర, రాయపాటి అజ య్, పువ్వాడి దామోదర్ పాల్గొన్నారు. అలాగే బీజేపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సత్కరించారు.