సమస్యల పరిష్కారంతోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2022-07-01T06:21:32+05:30 IST
సమస్యల పరిష్కారంతోనే అభివృద్ధి
శామీర్పేట, జూన్ 30 : ప్రజాసమస్యల పరిష్కారంతోనే అభివృద్ధి సాధ్యమని తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు అన్నారు. గురువారం మున్సిపాలిటీలోని డంపింగ్యార్డు వద్ద చెత్తను ఎత్తివేసే(తరలించే) పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూంకుంట వద్ద గల రాజీవ్ రహదారిపై ఉన్న డంపింగ్యార్డులోని చెత్తను జవహర్నగర్ డంపింగ్యార్డుకు తరలిస్తున్నట్లు తెలిపారు. రూ.33 లక్షలతో చెత్త ఎత్తివేత పనులను చేపట్టినట్లు వివరించారు. స్వచ్ఛ మున్సిపాలిటీ ఏర్పాటుదిశగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వేణుగోపాల్రెడ్డి, పర్యావరణ ఇంజనీర్ గణేష్, భాను, నరేందర్ పాల్గొన్నారు.