విద్యతోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2022-07-07T05:59:04+05:30 IST
విద్యతోనే అభివృద్ధి
ఏలూరు కలెక్టరేట్, జూలై 6: విద్యతోనే అ భివృద్ధి సాధ్యమని, ఉ న్నత లక్ష్యాలను నిర్దే శించుకుని, వాటిని చే రుకునేందుకు ఇష్టపడి చదవాలని విద్యా ర్థులకు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యా ర్థులను బుధవారం కలెక్టర్ సత్కరించి అభి నందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య నభ్యసించే విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడం ద్వారా విద్యా ప్రమాణాలు పెం చేందుకు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోం దన్నారు. 580 మార్కులు సాధిం చిన సింగగూడెం జడ్పీ స్కూలు విద్యార్థిని అమీషాబేగం, 579 మార్కులతో రెండో స్థానం, 578 మార్కులతో మూడో స్థానం సాధించిన నాగిరెడ్డిగూడేనికి చెందిన ఏపీ బా లికల రెడిసిడెన్షియల్ హైస్కూలుకు చెందిన వే ఘనా భవాని, కె.నీరజకు పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందించారు. జేసీ పి.అరుణ్బాబు, డీఈవో ఆర్ ఎస్ గంగాభవాని, ఎస్ఎస్ ఏపీవో పాల్గొన్నారు.