AP News: రూ. 500 కోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి: విడదల రజిని

ABN , First Publish Date - 2022-10-07T21:54:41+05:30 IST

Guntur: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అందులో భాగంగానే నాడు - నేడు పథకం కింద రూ. 500 కోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి విడదల రజిని తెలిపారు. రూ. 16 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ

AP News: రూ. 500 కోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి: విడదల రజిని

Guntur: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan) ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అందులో భాగంగానే  నాడు - నేడు పథకం కింద రూ. 500 కోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి(GGH)ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి విడదల రజిని (Vidadala Rajani)  తెలిపారు. రూ. 16 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రంలో  మరో 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 600 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, హాస్పటల్ నిర్మాణానికి ‘జింఖానా’ సభ్యులు రూ. 80 కోట్లు ఇవ్వటం గర్వకారణగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయంలో జీజీహెచ్‌లో పసికందులను ఎలుకలు కొరిగేసిన ఘటన చూశామని, కరెంటు పోతే  వైద్యులు సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో ఆపరేషన్ చేసిన ఘటన కూడా అందరికీ తెలుసునని చెప్పారు.  

Updated Date - 2022-10-07T21:54:41+05:30 IST