అసమర్ధ పాలనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-08-14T21:51:34+05:30 IST

విజయవాడ: అసమర్ధ, అవినీతి పాలన కారణంగా ఏపీ(Andhra Pradesh) రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (BJP AP President Somu vverraju) విమర్శించారు. ఈ అంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు యువ సంఘర్షణ యాత్ర

అసమర్ధ పాలనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది: సోము వీర్రాజు

విజయవాడ: అసమర్ధ, అవినీతి పాలన కారణంగా ఏపీ(Andhra Pradesh) రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (BJP AP President Somu vverraju) విమర్శించారు. ఈ అంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు యువ సంఘర్షణ యాత్ర చేపట్టామని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా ఎలా పని చేయాలి? అనే దాన్ని కూడా వివరిస్తూ యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం  కేంద్రం రూ. వేల కోట్ల ఇస్తుందని, ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పెట్రోలియం కాంప్లెక్స్ వల్ల నాలుగు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల మందికి  కూడా ఉద్యోగాలు కల్పించలేకపోయిందన్నారు.




Updated Date - 2022-08-14T21:51:34+05:30 IST