కాంగ్రెస్‌ పాలనలోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-11T05:34:15+05:30 IST

దేశంలో కాంగ్రెస్‌ పాలనలో ప్రపంచీకరణ సాధ్యమై అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. బుధవారం ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా పట్టణంలో గౌరవ యాత్రను నిర్వహించారు.

కాంగ్రెస్‌ పాలనలోనే అభివృద్ధి
గౌరవ యాత్ర చేపడుతున్న డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి

డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి
నరసన్నపేట:
దేశంలో కాంగ్రెస్‌ పాలనలో ప్రపంచీకరణ సాధ్యమై అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. బుధవారం ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా పట్టణంలో గౌరవ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ అభ్యున్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు నేటి పాలకులకు ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ కన్వీనర్‌ సనపల అన్నాజీరావు, అంబటి కృష్ణారావు, పైడి నాగభూషణం, దుప్పట్ల మధుసూదనరావు, లఖినేని సాయిరాం, దంత త్రినాథరావు, దాలినాయుడు, అంబటి రమణ తదితరులు పాల్గొన్నారు.  
 

Updated Date - 2022-08-11T05:34:15+05:30 IST