టీడీపీ హయాంలోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2022-10-04T05:16:42+05:30 IST
తంబ ళ్లపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మె ల్యే శంకర్యాదవ్ హయంలో 2 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని పెద్దమండ్యం మండల టీడీపీ కన్వీన ర్ వెంకటరమణ పేర్కొన్నారు.
పెద్దమండ్యం, అక్టోబరు 3: తంబ ళ్లపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మె ల్యే శంకర్యాదవ్ హయంలో 2 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని పెద్దమండ్యం మండల టీడీపీ కన్వీన ర్ వెంకటరమణ పేర్కొన్నారు. పెద్ద మండ్యంలో సోమవారం మండల టీడీపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లి మాజీ ఎమ్మె ల్యే శంకర్తో గతంలో లబ్ధి పొందిన కొం దరు విమర్శలు చేయడం ఎంత వరకు సబబన్నారు. రాజకీయంలో రాజకీయ విమర్శలు చేయడం సహజమన్నారు. కానీ వ్యక్తి గత విమర్శలు చేయడం తగదన్నారు. ఎస్టీ ప్రాంతాలలో అభివృద్ధి చేయాలని రాజంపేట పార్లమెంటరీ టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు నటరాజ్నాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు మనోహర్ నాయక్, మండల టీడీపీ ఉపాధ్యక్షుడు నార శ్రీనివాసులు నాయకులు గంగాధర, బిక్కా మధుకర, మహేష్, భానుయాదవ్, మైసూరి శ్రీనివాసులు, ఓబులేసు, మహేష్, పెద్దన్న, బావాజీ తదితరులు పాల్గొన్నారు.