టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి

ABN , First Publish Date - 2022-05-22T05:51:21+05:30 IST

మళ్లీ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలంటే టీడీపీ అఽధికారంలోకి రావాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఉమా

మహానాడు సన్నాహక సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా

గొల్లపూడి, మే 21 : మళ్లీ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలంటే టీడీపీ అఽధికారంలోకి రావాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో మైలవరం నియోజకవర్గంలోని నాయకులతో శనివారం రాత్రి మహానాడు సన్నాహక సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలు శివారు మండవవారిపాలెంలో జరగనున్న మహానాడులో మొదటి రోజు సుమారు 10 వేల మందితో సభ ఉంటుందని, 17 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు, రెండో రోజు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ఆయన శత జయంతి వేడుకలను  నిర్వహించన్నుట్టు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, జంపాల సీతారామయ్య, ఉయ్యూరు వెంకట నరసింహారావు, కె.విజయబాబు, నర్రా వాసు, ముప్పిడి నాగేశ్వర రెడ్డి, జాలిపర్తి గోపాలకృష్ణ, గూడపాటి పద్మశేఖర్‌, వడ్లమూడి చలపతి, సాధనాల వెంకటేశ్వరమ్మ, షేక్‌ కరిముల్లా, పలు మండలాల అధ్యక్షులు, కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మన్నం వెంకట చౌదరి, ధనేకుల శ్రీకాంత్‌, సుకవాసి శ్రీహరి, లంక లితీష్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T05:51:21+05:30 IST