చంద్రబాబుతోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2021-04-21T05:02:13+05:30 IST
ఉమ్మడి రాష్ట్రం, విభజన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు సారథ్యంలోనే అభివృద్ధి సాధించిందని కడప నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ అమీర్బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డిలు అన్నారు.
కడప, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రం, విభజన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు సారథ్యంలోనే అభివృద్ధి సాధించిందని కడప నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ అమీర్బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డిలు అన్నారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అమీర్బాబు టీడీపీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ నిరాశ్రయుల కేంద్రంలో అన్నదానం చేశారు. గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు 10 అడుగుల చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పీరయ్య, నగర అధ్యక్షుడు జిలానీబాషా, కార్యదర్శి వికా్సహరి, జయచంద్ర, బాలదాసు, సుబ్బరాయుడు, నబీకోట శ్రీనివాసులు, జయకుమార్, రాంప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు.