అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-07-06T10:08:53+05:30 IST
గ్రామాల్లో అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి సబితారెడ్డి అన్నారు.
మంత్రి సబితారెడ్డి
మహేశ్వరం : గ్రామాల్లో అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులతో పాటు అధికారులతో మంత్రి నివాసంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో ప్లేగ్రౌండ్, పార్కు, గొర్రెల షెడ్లు ఏర్పాటు కోసం స్థలాలు ఎంపిక చేసుకోవాలన్నారు. రైతులు పొలాల వద్ద కల్లాలు నిర్మించుకునేలా చూడాలని సర్పంచులకు సూచించారు. రేషన్ పంపిణీ ప్రక్రియను పరిశీలించాలన్నారు. ప్రతీ గ్రామంలో శ్మశానవాటిక, డంపింగ్యార్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ రఘుమారెడ్డి, డీఎల్పీవో శ్రీనివాస్, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో నర్సింహ తదితరులు పాల్గొన్నారు.