అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-03-04T05:25:19+05:30 IST
సిర్పూర్(టి) మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ రాజేశ్వర్ అన్నారు.
-ఎంపీడీవో రాజేశ్వర్
సిర్పూర్(టి), మార్చి3: సిర్పూర్(టి) మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ రాజేశ్వర్ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మండ లంలో చేపడుతున్న పనులను బుధవారం ఎంపీడీఓ రాజేశ్వర్ పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. నర్సరీల్లో మొక్కలు ఎండి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయ న వెంట ఎంపీఓ కృష్ణమూర్తి, ఏపీఎం రామ్మోహన్రావు, కార్యదర్శులు తదితరులు ఉన్నారు.