అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-08-13T06:24:01+05:30 IST

జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, అగస్టు 12 : జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్‌లో శుక్రవారం సంబంధిత అఽధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్సీ వసతి గృహాల నవీకరణ, గంభీరావుపేటలో భవిత సెంటర్‌, ఆరోగ్య ఉపకేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు, ఎల్లారెడ్డిపేట వృద్ధుల డేకేర్‌ సెంటర్‌, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీలలో మౌలిక  సదుపాయాల పురోగతిపై  ఇంజనీరింగ్‌ అధికారులను   అడిగి తెలుసుకున్నారు.  సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, పంచాయతీరాజ్‌ ఈఈ సూర్యప్రకాష్‌, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-13T06:24:01+05:30 IST