అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-07-06T06:09:04+05:30 IST

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీసీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఆదేశించారు.

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
శాలిగౌరారంలో మాట్లాడుతున్న ప్రేమ్‌కరణ్‌రెడ్డి

జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి

శాలిగౌరారం, జూలై 5: అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీసీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కలను నాటడంలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలుంటాయన్నారు. మండలంలోని పలు పాఠశాలలకు ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో కొనసాగుతున్న పాఠశాల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు ప్రత్యేకశ్రద్ధ చూపాలన్నారు. అనంతరం మండల పరిధిలోని పెర్కకొండారంనుంచి వంగమర్తి గ్రామం వరకు జాతీయ రహదారి వెంట నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయనవెంట ఎంపీడీవో రేఖల లక్ష్మయ్య, ఎంపీవో సుధాకర్‌, కార్యదర్శులు ఉన్నారు. 


Updated Date - 2022-07-06T06:09:04+05:30 IST