Fadnavis: మహారాష్ట్రలో మరో కీలక పరిణామం.. సీఎంగా షిండే.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్

ABN , First Publish Date - 2022-07-01T00:57:38+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న బీజేపీ.. ఏక్‌నాథ్ షిండే సీఎంగా కొనసాగే ప్రభుత్వంలో కొనసాగాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌‌ను..

Fadnavis: మహారాష్ట్రలో మరో కీలక పరిణామం.. సీఎంగా షిండే.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న బీజేపీ.. ఏక్‌నాథ్ షిండే సీఎంగా కొనసాగే ప్రభుత్వంలో కొనసాగాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌‌ను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కేంద్ర అధినాయకత్వం సూచించింది. ఫడ్నవీస్ కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. తొలుత బయట నుంచి బీజేపీ మద్దతు ఉంటుందని ఫడ్నవీస్ ప్రకటించినప్పటికీ ప్రభుత్వంలో పాలుపంచుకోవాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించడంతో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉంటారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. అమిత్ షా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-07-01T00:57:38+05:30 IST