కనుల పండువగా దేవీ నవరాత్రోత్సవాలు
ABN , First Publish Date - 2022-09-29T04:23:21+05:30 IST
దేవీ నవరాత్రోత్సవాలు బుధవారం పట్టణంలో కనుల పండువగా జరిగాయి. భక్తులతో ఆలయాలు కిక్కిరిశాయి.
కావలిటౌన్, సెప్టెంబరు 28: దేవీ నవరాత్రోత్సవాలు బుధవారం పట్టణంలో కనుల పండువగా జరిగాయి. భక్తులతో ఆలయాలు కిక్కిరిశాయి. గ్రామ దేవత కళుగోళశాంభవి మహాగౌరీగా, పాతూరులోని దుర్గాభ్రమరాంభిక అన్నపూర్ణాదేవిగా, విష్టాలయంలో రాజ్యలక్ష్మి ధైర్యలక్ష్మిగా, వడ్డెపాలెంలోని కనకదుర్గా అమ్మవారు గాయత్రీదేవీగా, కొత్తబజారులోని కన్యకాపరమేశ్వరీ ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.