ప్రారంభమైన దేవి శరన్నవరాత్రులు
ABN , First Publish Date - 2022-09-27T03:46:06+05:30 IST
దేవి శరన్నవరాత్రులు సోమవారం ప్రారంభమ య్యాయి. ముల్కలలో ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మండపాలను అందంగా అలంకరించి దుర్గాదేవిని ప్రతిష్టించారు.
హాజీపూర్, సెప్టెంబరు 26: దేవి శరన్నవరాత్రులు సోమవారం ప్రారంభమ య్యాయి. ముల్కలలో ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మండపాలను అందంగా అలంకరించి దుర్గాదేవిని ప్రతిష్టించారు.
కన్నెపల్లి: దుర్గాదేవికి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మండపాల నిర్వహకులు నవరాత్రుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
నస్పూర్: దుర్గా మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సీసీసీ ముక్కిడి పోచ మ్మ, నాగార్జున కాలనీ, గోదావరి కాలనీ, సీసీసీ, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారిని సోమవారం ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్రావు దర్శించుకున్నారు. అక్కూరి సుబ్బయ్య, సంతోష్చారి, సంపత్, రమేష్, ఎంబడి సమ్మయ్య, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బండి పద్మ, తదితరులు ఉన్నారు.