వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-10-02T04:47:46+05:30 IST
వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ఆమనగల్లు/కడ్తాల్/చేవెళ్ల/షాబాద్/షాద్నగర్ రూరల్/షాద్నగర్అర్బన్/చౌదరిగూడ/శంషాబాద్ రూరల్ అక్టోబరు 1: జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆమనగల్లు పట్టణంలోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆరవ రోజు శనివారం అమ్మవారు శ్రీగాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా హోమం, అభిషేకం, నిత్యపూజలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ కార్యదర్శి యాచారం వెంకటేశ్వర్లుగౌడ్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. పూజల అనంతరం వారిని ఆలయ నిర్వాహకులు సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవకమిటీ సభ్యులు యాదయ్య, పాండయ్య, రామ్మోహన్, నర్సింహ, డాక్టర్ వాసు, శ్రీనివాస్, గోపాల్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భక్తమార్కండేయ ఆలయంలో జరిగిన వేడుకల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్సరెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్ చెన్నకేశవులు, లయన్స్క్లబ్ ఉపాధ్యక్షుడు రాము ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు నాగభూషన్, శరత్చంద్రల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించగా మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, యువజన సంఘం అధ్యక్షుడు శెట్టి రవి, మహిళా అధ్యక్షురాలు అలివేలు పాల్గొన్నారు. కడ్తాల మండలం మైసిగండి శివరామాలయాల్లో దేవీ నవరాత్రోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీభవానీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తిశ్రద్ధలతో ఛండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ట్రస్టీ సిరోలిపంతూ, ఈవో స్నేహలత, తహసీల్దార్ ఆర్పి.జ్యోతి, ఉత్సవ నిర్వాహకుడు భాస్కర్, సర్పంచ్ తులసీరామ్ నాయక్, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్, శ్రీనివా్సగౌడ్ పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్ల మండలంలోని రచ్చబండ వద్ద గల దుర్గాదేవి మండపంలో అమ్మవారికి 108వంటకాలు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించారు. షాబాద్లోని ఆయా గ్రామాల్లో దుర్గా నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. షరూఖ్నగర్ మండలం ఎలికట్ట భవానీ మాత ఆలయంలో హోమం నిర్వహించగా జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా పల్లకీసేవలో మాజీ ఎంపీపీ శ్రీనివా్సరెడ్డి, సర్పంచ్ సాయిప్రసాద్ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణయ్య పాల్గొన్నారు. షాద్నగర్లోని మండపాల్లో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. బైపాస్ రోడ్డులోని బంగారు మైసమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం నిర్వహించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు అందెమోహన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి షాద్నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీర్లపల్లిశంకర్ హాజరయ్యారు. అదేవిధంగా చౌదరిగూడ మండలంలోని తుమ్మలపల్లిలో హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారు శ్రీమహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, ఓడిబియ్యం, మంగళహారతులు నిర్వహించారు. వీరన్నపేట్లో అన్నదానం, హోమం,యజ్ఞం నిర్వహించారు. అదేవిధంగా శంషాబాద్లోని రాళ్లగూడలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో ఎమ్మెల్యే ప్రకా్షగౌడ్, కౌన్సిలర్ భాగ్యలక్ష్మి, శ్రీకాంత్యాదవ్లు పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు.