వైసీపీ ప్రభుత్వంపై దేవినేని ఫైర్

ABN , First Publish Date - 2021-01-25T00:19:41+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై దేవినేని ఫైర్

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై  ట్విట్టర్ వేదికగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు.కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని కేసులతో భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ఐదు దశాబ్దాల రాజకీయాల్లో ఏ కేసులేని కోట్ల కుటుంబంపై అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైసీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, లిక్కర్, గ్యాంబ్లింగ్ మాఫియాపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. పోలీసుల తీరు ఆక్షేపనీయమన్నారు. సీఎం జగన్‌ చర్యలు ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగిస్తున్నాయని దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-01-25T00:19:41+05:30 IST