మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడారు: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-10-26T23:36:42+05:30 IST

మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడారు: దేవినేని ఉమ

మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడారు: దేవినేని ఉమ

అమరావతి: పోలవరంపై మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 71.02 శాతం పూర్తయ్యాయని ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకుందన్నారు. పోలవరం ఉనికి ప్రమాదంలో పడితే సీఎం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘‘పోలవరం అంచనాలపై వైసీపీ తప్పుడు ప్రచారంతోనే నష్టం. 2017-18 రేట్ల ప్రకారం పోలవరం అంచనాలు రూ.57,297 కోట్లు. డీపీఆర్‌-1 కు.. డీపీఆర్‌-2కు ముంపు పెరిగింది..పరిహారం పెరిగింది. కేంద్రం ప్రశ్నలకు సమాధానం చెబితే రూ.55,548 కోట్లకు ఆమోదం తెలిపారు. రూ.55,548 కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపిందని...2019 జూన్ 24న పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి చెప్పారు. పోలవరంలో ఇరిగేషన్‌తో పాటు పునరావాసం ఖర్చు కూడా భరిస్తామని గతంలో కేంద్రం ఒప్పుకుంది. గడ్కరీ ప్రాజెక్ట్ వద్దకు వచ్చినప్పుడు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు’’ అని వివరించారు.

Updated Date - 2020-10-26T23:36:42+05:30 IST