సీఎం గాల్లో చక్కర్లు కొడితే రైతుల బాధలెలా తెలుస్తాయి: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-11-30T00:37:35+05:30 IST

రైతులు ఇబ్బందులు పడుతుంటే.. జగన్ గాల్లోనే చక్కర్లు కొట్టి వచ్చారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. పర్చూరు మండలం చిననందిపాడులో

సీఎం గాల్లో చక్కర్లు కొడితే రైతుల బాధలెలా తెలుస్తాయి: దేవినేని ఉమ

ప్రకాశం: రైతులు ఇబ్బందులు పడుతుంటే.. జగన్ గాల్లోనే చక్కర్లు కొట్టి వచ్చారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. పర్చూరు మండలం చిననందిపాడులో  దేవినేని ఉమ పర్యటించారు. తుపానుకు దెబ్బతిన్న మిరప పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి సబ్సిడీతో రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగడతామని దేవినేని ఉమ హెచ్చరించారు.

Updated Date - 2020-11-30T00:37:35+05:30 IST