పోలవరం టన్నెల్ లైనింగ్ పనుల్లో నిర్లక్ష్యం: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-10-31T16:43:35+05:30 IST

టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

పోలవరం టన్నెల్ లైనింగ్ పనుల్లో నిర్లక్ష్యం: దేవినేని ఉమ

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం బహుళార్థక ప్రాజెక్టును ఎత్తిపోతల ప్రాజెక్టుగా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ డ్రామాలాడారని, టన్నెల్ లైనింగ్ పనుల్లో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. నిర్వాసితులకిచ్చిన హామీలు గాలికొదిలేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 29 నెలలలవుతోందని, ప్రాజెక్టులో ఎంత శాతం పనిచేశారు?.. పునరావాసం కోసం ఎంత ఖర్చుపెట్టారని దేవినేని ఉమ నిలదీశారు. 

Updated Date - 2021-10-31T16:43:35+05:30 IST