ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఖజానా ఖాళీచేసిన సర్కార్: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-11-30T17:48:02+05:30 IST

దేవినేని ఉమ మహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఖజానా ఖాళీచేసిన సర్కార్: దేవినేని ఉమ

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఖజానా ఖాళీ చేసిందని, నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా రూ. 400 కోట్లు స్వాహా చేసిందని విమర్శించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎస్ఎఫ్ఎస్సీకి మళ్లించిందని ఆరోపించారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సీఎం తన పాలనా వైఫల్యానికి విద్యార్థుల భవిష్యత్తు బలిచేస్తారా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2021-11-30T17:48:02+05:30 IST