Jagan Govt: కోతలు, అరకొర చెల్లింపులే.. : దేవినేని
ABN , First Publish Date - 2022-07-19T15:54:16+05:30 IST
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్రెడ్డిపై ట్విటర్ వేదికగా మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్రెడ్డి(CM JAGAN)పై ట్విటర్ వేదికగా మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ(Devineni UMA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్ ప్రభుత్వంలో కోతలు, అరకొర చెల్లింపులే ఉన్నాయి. నాడు చంద్రబాబు (CHANDRABABU) అభివృద్ధి, సంక్షేమంతో ఏపీని అగ్రగామిగా నిలిపారు. నేడు బటన్ నొక్కడమే సీఎం జగన్ పని. క్రాప్ ఇన్సూరెన్స్ (Crop Insurance) లోనూ భారీ దోపిడీ జరిగింది. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో ఎంత నగదు జమచేశారో.. శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా?’’ అని దేవినేని ఉమ ట్విటర్లో డిమాండ్ చేశారు.