‘పోలవరం ప్రయోజనాలను ముందే చంద్రబాబు అందించారు’
ABN , First Publish Date - 2021-10-18T23:59:57+05:30 IST
పట్టిసీమతో రైతులకు పోలవరం ప్రయోజనాలను ముందే చంద్రబాబు అందించారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. నాడు పట్టిసీమ దండగ, పంపులు పీకుతామన్నారని చెప్పారు.
అమరావతి: పట్టిసీమతో రైతులకు పోలవరం ప్రయోజనాలను ముందే చంద్రబాబు అందించారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. నాడు పట్టిసీమ దండగ, పంపులు పీకుతామన్నారని చెప్పారు. నేడు కమీషన్ల కక్కుర్తితో పోలవరంలో 914 కోట్లతో మరో ఎత్తిపోతల పెడుతున్నారని పేర్కొన్నారు. పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా మార్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు.