తిరగబడే రోజులు దగ్గర్లోనే..

ABN , First Publish Date - 2022-07-06T07:11:31+05:30 IST

రాష్ట్ర రైతాంగం ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

తిరగబడే రోజులు దగ్గర్లోనే..

- 9న పరిటాలలో రైతు పోరు సభ

- ప్రజలు, రైతుల్లో చైతన్యమే లక్ష్యం

- మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడి

గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం), జూలై 5: రాష్ట్ర రైతాంగం ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈనెల 9వ తేదిన కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో పెద్దఎత్తున నిర్వహించనున్న రైతుపోరు బహరంగ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గుంటుపల్లి టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో గల 35 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు కమిటీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం 37నెలల్లో రైతు వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. ప్రజలు, రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. టీడీపీ రైతు కమిటీ నాయకులు జాస్తి రామకృష్ణ, పెదర్ల రవి, చెరుకూరి చినవెంకయ్య, గొట్టుముక్కల సుమంత్‌(బాపు) చుట్టుకుదురు శ్రీనివాసరావు, మైలా సైదులు టీఎన్‌టీయూసీ నాయకులు రెంటపల్లి శ్యామ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T07:11:31+05:30 IST