వివేకా హత్య కేసు.. విజయసాయిని సీబీఐ ఎందుకు విచారించలేదు?: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2022-02-23T17:29:49+05:30 IST
విజయవాడ: వైఎస్ వివేకా హత్య కేసుపై దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: వైఎస్ వివేకా హత్య కేసుపై దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో విజయసాయి రెడ్డిని సీబీఐ అధికారులు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. వివేకా హత్య వెనుక రకరకాల కథనాలు వస్తున్నాయన్నారు. గొడ్డలి వేటు చివరికి సీబీఐ అధికారిపై కేసు పెట్టే స్థాయికి వెళ్లిందన్నారు. అవినాష్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. అప్రూవర్గా మారిన దస్తగిరిని పట్టపగలే బెదిరిస్తున్నారని, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎవరితో ఏం మాట్లాడారు? సీబీఐ విచారణలో వాస్తవాలన్నీ బయటపెట్టాలన్నారు. అసలు నేరస్థులు బయటకురావాలని, సీఎం జగన్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.