పన్నులభారం మోపడంలో కొత్తపుంతలు తొక్కుతున్న వైసీపీ: దేవినేని

ABN , First Publish Date - 2022-03-19T20:33:25+05:30 IST

వైసీపీ సర్కారు, సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

పన్నులభారం మోపడంలో కొత్తపుంతలు తొక్కుతున్న వైసీపీ: దేవినేని

అమరావతి: వైసీపీ సర్కారు, సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘పన్నుల భారం మోపడంలో  వైసీపీ సర్కార్ కొత్తపుంతలు తొక్కుతోంది. రెండు వారాల్లో వెయ్యికోట్ల ఆస్తి, చెత్తపన్ను వసూలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. జగన్‌కి ఒక్కఛాన్స్ ఇచ్చిన ప్రజల జేబులు కొల్లగొట్టడంపై పెట్టిన శ్రద్ధ సంపద సృష్టించడంపై పెట్టొచ్చుకదా? ’’ అని సీఎం జగన్మోహన్‌రెడ్డిపై దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-19T20:33:25+05:30 IST