Basara సరస్వతీ ఆలయంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-06-10T13:57:04+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.
నిర్మల్: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రద్దీ పెరుగుతోంది. భారీ సంఖ్యలో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తున్నారు.