లక్ష్మీనరసింహ స్వామికి భక్తుల నీరాజనం

ABN , First Publish Date - 2021-03-01T05:39:05+05:30 IST

మండలంలోని దిల్దార్‌నగర్‌ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో గోదావరి సమీపంలో కొండగుహలో వెలిసిన అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి జాతర శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక

లక్ష్మీనరసింహ స్వామికి భక్తుల నీరాజనం
స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్న భక్తులు

అంగరంగ వైభవంగా అక్కకొండ జాతర

కడెం, ఫిబ్రవరి 28: మండలంలోని దిల్దార్‌నగర్‌ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో గోదావరి సమీపంలో కొండగుహలో వెలిసిన అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి జాతర శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి  ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద వస్తువులను కొనుగోలు చేశారు. ఆదివారం తెల్లవారు జామున రథోత్సవం నిర్వహించారు. ఆలయం పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది.

Updated Date - 2021-03-01T05:39:05+05:30 IST