అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2022-08-14T06:36:04+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో సింహగిరి కిటకిటలాడింది.
శనివారం ఒక్కరోజు రూ.35.6 లక్షల ఆదాయం
సింహాచలం, ఆగస్టు 13: వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో సింహగిరి కిటకిటలాడింది. దీంతో స్వామి దర్శనానికి భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే కేశఖండన శాల వద్ద వేచి ఉండక తప్పలేదు. కాగా, స్వామి వారి ఖజానాకు భారీగా ఆదాయం కూడా సమకూరింది. శనివారం ఒక్కరోజే రూ.35.6 లక్షల ఆదాయం వచ్చినట్లు అదికారులు తెలిపారు.