కాణిపాకంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-01-16T06:34:06+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి శుక్రవారం అఽధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

కాణిపాకంలో భక్తుల రద్దీ
క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు

ఐరాల(కాణిపాకం), జనవరి 15: ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి  శుక్రవారం  అఽధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వరుస సెలవులు కావడంతో ఉదయం నుంచి భక్తులు భారీగా ఆలయానికి చేరుకోవడంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి. దీంతో అధికారులు భక్తులకు మహాలఘు దర్శనాన్ని ఏర్పాటు చేశారు.  క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా డీఆర్‌డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఆయన్ను ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు.  బీజేపీ నాయకుడు భానుప్రకా్‌షరెడ్డి, తహసీల్దార్‌ బెన్నురాజ, కాణిపాకం ఎస్‌ఐ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T06:34:06+05:30 IST