తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

ABN , First Publish Date - 2021-01-22T13:47:19+05:30 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇటీవలి కాలంలో 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నదైతే లేదు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇటీవలి కాలంలో 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నదైతే లేదు. కాగా.. గురువారం శ్రీవారిని 41,442 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 99 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారిని దర్శించుకుని 18,161 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

Updated Date - 2021-01-22T13:47:19+05:30 IST