కదిలికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2022-08-09T05:39:36+05:30 IST
మండలంలోని కదిలి పాపహరేశ్వరస్వామి దర్శ నం కోసం సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు.
దిలావర్పూర్, ఆగస్టు 8 : మండలంలోని కదిలి పాపహరేశ్వరస్వామి దర్శ నం కోసం సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. కుండపోతగా కురు స్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు స్వామివారి సన్నధికి చేరు కున్నారు. వందలాదిగా వచ్చిన భక్తులతో కదిలిలొద్ది కిక్కిరిసింది. శ్రావణ మాసం రెండో సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. పాపహరే శ్వరస్వామి, శ్రీ మాతాన్నపూర్ణేశ్వరిదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భైంసా మండలం బాల్గామ్ చెందిన భజనబృందం వారు ఆలపించిన భజన గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులకు మాడెగాం గ్రామానికి చెందిన పరుశురాం పటేల్, దిలావర్పూర్ గ్రామానికి చెందిన తుకారాం, గంగాధర్, ఏ. ముత్యం, రాజులు అన్నదానం చేశారు. అన్నదాతలకు దేవస్థానం చైర్మన్ భుజంగరావు పటేల్ ఘనంగా సత్కరిం చారు.