తమిళనాడుకు భక్తులకు అలిపిరి వద్ద చేదు అనుభవం

ABN , First Publish Date - 2022-04-16T22:23:49+05:30 IST

తమిళనాడుకు చెందిన భక్తులకు అలిపిరి దగ్గర చేదు అనుభవం ఎదురైంది. వాయిద్య పరికారాలతో తిరుమలకు వెళ్లేందుకు తమిళనాడు

తమిళనాడుకు భక్తులకు అలిపిరి వద్ద చేదు అనుభవం

తిరుపతి: తమిళనాడుకు చెందిన భక్తులకు అలిపిరి దగ్గర చేదు అనుభవం ఎదురైంది. వాయిద్య పరికారాలతో తిరుమలకు వెళ్లేందుకు తమిళనాడు భక్తులు ప్రయత్నించారు. అయితే వాయిద్య పరికరాలతో తిరుమలకు అనుమతించమని సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డిని తమిళ భక్తులు ఆశ్రయించారు. అలిపిరి దగ్గర టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిపై భానుప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. 30 ఏళ్లుగా సంకీర్తనలతో తిరుమలకు నడిచే వెళ్లేవాళ్లమని, గతంలో ఇలాంటి సమస్య ఎదురుకాలేదని  భక్తులు చెబుతున్నారు. టీటీడీ తీరు మార్చుకోకుంటే ఉద్యమిస్తామని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-04-16T22:23:49+05:30 IST