భక్తజన సంద్రంగా బోయకొండ

ABN , First Publish Date - 2022-08-08T05:05:47+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిట లాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకా తమిళనాడు, కర్ణాటకల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు.

భక్తజన సంద్రంగా బోయకొండ
ప్రత్యేకాలంకారంలో బోయకొండ గంగమ్మ

చౌడేపల్లె, ఆగస్టు7: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిట లాడింది. ఉదయాన్నే  అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి ప్రీతికరమైన వేపాకు తోరణాలతో ఆలయాన్ని అలంకరించారు. అమ్మవారిని స్వర్ణాభరణాలతో, పూలతో  అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకా తమిళనాడు, కర్ణాటకల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. భక్తుల ఏర్పాట్లు ఆలయ చైర్మన్‌  శంకర్‌నారాయణ, ఈవో చంద్రమౌళి పర్యవేక్షించారు.




Updated Date - 2022-08-08T05:05:47+05:30 IST