ముగిసిన మధున పోచమ్మ జాతర

ABN , First Publish Date - 2020-12-03T04:43:45+05:30 IST

మండలంలోని జనగామ గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న మధున పోచమ్మ జాతర బుధవారం అమ్మవారికి బోనాల సమర్పణతో ముగిసింది.

ముగిసిన మధున పోచమ్మ జాతర
జాతరలో భక్తుల సందడి

కోటపల్లి, డిసెంబరు 2:  మండలంలోని జనగామ గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న మధున పోచమ్మ జాతర బుధవారం అమ్మవారికి బోనాల సమర్పణతో ముగిసింది. బోనాల సమర్పణ కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. కొత్తకుం డలో కొత్తబియ్యం, బెల్లంతో వండిన పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని మంగళహారతులతో అమ్మవారి చెంతకు వచ్చి ప్రదర్శనలు చేశారు. డప్పుచప్పుళ్లు, వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో జాతర ప్రాంగణం సందడిగా మారింది. జనగామతో పాటు  చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారికి మొ క్కులు చెల్లించుకున్నారు. ప్రాణహిత అవతలి మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు  చెందిన భక్తులు మంగళవారం జరిగిన రథోత్సవానికి హాజరై అక్కడే నిద్రించి బోనాల సమర్పించుకుని ఇంటి దారి పట్టారు. గ్రామానికి చెందిన దిలీప్‌ అనే యువకుడు పోతరాజు వి న్యాసంతో ఆకట్టుకున్నాడు. శివసత్తుల పూనకాలు జాతరలో ఆకర్షణ గా నిలిచాయి. కాగా మూడు రోజుల పాటు సాగిన జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా సర్పంచ్‌ గట్టు లక్ష్మణ్‌గౌడ్‌ పలు సౌకర్యాలు కల్పించగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-12-03T04:43:45+05:30 IST