
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర పాల్గొన్నారు. సినీ నటుడు రాజా రవీంద్ర విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్లో నవీన్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తన వంతుగా మొక్కలు నాటడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని నవీన్ చంద్ర తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశాన్ని పచ్చని వనంలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం తమిళ హీరో ధనుష్, రాహుల్ రవీంద్రన్, సలోని లూథర, చాందిని చౌదరిలకు ఈ సవాల్ విసిరారు. ఒక్కొక్కరూ మరో ముగ్గురిని నామినేట్ చేయాలని కోరారు.