ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2020-12-02T05:59:55+05:30 IST
కొండమల్లేపల్లి మార్కెట్యార్డుకు తెచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని మంగళవారం మార్కెట్ ఎదుట ధర్నాచేశారు.
కొండమల్లేపల్లి, డిసెంబరు 1: కొండమల్లేపల్లి మార్కెట్యార్డుకు తెచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని మంగళవారం మార్కెట్ ఎదుట ధర్నాచేశారు. ధాన్యం తెచ్చి 20రోజులు గడుస్తున్నా తేమశాతం అధికంగా ఉందని అధికారులు కాలయాపన చేస్తున్నారని తెలిపారు. సన్నరకం సాగు చేయాలని ప్రభుత్వం చెబుతోందని, ధాన్యం పండించి మార్కెట్కు తెస్తే తేమశాతం, రంగుమారిందని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం రాశులు అడుగుభాగంలో తడిసి మొలకలెత్తాయన్నారు. వ్యవసాయ, సివిల్ సప్లయి అధికారులు ధాన్యాన్ని మిల్లుల వద్దకు పంపితే తేమశాతం అధికంగా ఉందని మిల్లు నిర్వాహకులు కొనుగోలు చేయడంలేదని తెలిపారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.